- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సోమవారం ఒక్క రోజే 2392 కొత్త కేసులు నమోదుకాగా 11 మంది చనిపోయారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1.45 లక్షలకు చేరుకోగా 906 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణ ఇప్పటి వరకు 18.28 లక్షల మంది కరోనా పరీక్షలు చేశారు. కరోనా నుంచి 1.12 లక్షల మంది కోలుకోగా 31670 మంది చికిత్స పొందుతున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -