Friday, April 19, 2024

నదిలో పడిన పెళ్లిబృందం బస్సు.. 24 మంది మృతి

- Advertisement -
- Advertisement -

accident

జైపూర్: రాజస్థాన్‌లోని బుండి జిల్లా లఖేరీ ప్రాంతంలోని మేజ్ నదిలో పెళ్లిబృందంతో వెళుతున్న ఒక మినీ బస్సు పడి 24 మంది మరణించారు. బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. జైపూర్‌కు 250 కిలో మీటర్ల దూరంలోని పాప్డీ గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది. వంతెనపైన వెళుతుండగా బస్సును డ్రైవర్ అదుపుచేయలేకపోవడంతో నదిలో పడిపోయిందని అధికారులు చెప్పారు. మినీ బస్సులో మొత్తం 29 మంది పెళ్లి బృందం సభ్యులు ఉండగా ఐదుగురు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. నదిలో నుంచి 24 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. పెళ్లి బృందం కోటా నుంచి సవాయ్ మధోపూర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వారు తెలిపారు.

24 Killed as mini bus plunges into river in Rajasthan, the bus with 29 passengers on board lost contol while traversing a bridge and fell in the Mej River

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News