- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 244 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,63,906కు పెరిగింది. తాజాగా 296 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,55,061 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒక్కరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,907కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.66 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,938 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 50,505 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
- Advertisement -