Tuesday, April 16, 2024

దేశంలో 8లక్షలకు చేరువలో కరోనా కేసులు.. ఒక్కరోజే 25వేల కేసులు..

- Advertisement -
- Advertisement -

248779 New Corona Cases Reported in India

హైద‌రాబాద్‌: భారత్ లో మహమ్మారి క‌రోనా వైర‌స్ విజృంభణ రోజురోజుకూ తీవ్రస్థాయిలో పెరుగుతోంది. దీంతో ప్రతిరోజూ దేశంలో 20వేలకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 24,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో నిన్న ఒక్కరోజే 487మంది మ‌ర‌ణించారని తెలిపారు. దీంతో దేశ‌ంలో మొత్తం క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,67,296కు చేరుకుం‌ది. ఇక, కరోనాతో ఇప్పటివరకు మొత్తం 21,129మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,69,789మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వైర‌స్ నుంచి 4,76,378 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  నిన్న ఒక్కరోజే 2,67,061మందికి కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటీ 7 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని పేర్కొంది.

248779 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News