Friday, March 29, 2024

25 లక్షల మంది రెండో డోసు తీసుకోలేదు: డిహెచ్

- Advertisement -
- Advertisement -

Covid second wave ends in Telangana:Dr Srinivasa rao

హైదరాబాద్: 25 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోలేదని డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు.  90శాతం మొదటి డోస్ తీసుకున్నారని, వ్యాక్సిన్ తీసుకొక పోతే ఆత్మ హత్య చేసుకున్నట్లు లెక్కఅని అన్నారు. మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల అనే నిబంధన ఉందని, జరిమానా కూడా విధించబడుతుందన్నారు. ఇవాళ నుండి అన్ని ప్రయాణాల్లో వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. హెల్త్ సిబ్బంది ఇవ్వాళ్టి నుండి వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అనేది చెక్ చేస్తారన్నారు.

బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు ట్రావెల్ చేసిన మహిళ ది రంగారెడ్డి జిల్లా అని, ఆమెను టిమ్స్ లో కరోనా నిర్థారణ పరీక్ష చేయడంతో ఆమె పాజిటివ్ వచ్చిందని, జినోమ్ సీక్వెన్స్ కోసం పరీక్షలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ రావు తెలిపారు.  ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News