- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన ఒక్కరోజు కరోనా కేసులు తగ్గినట్లు తగ్గినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 25,072 కొత్త పాజిటీవ్ కేసులు నమోదైనట్టు తెలిపింది.వైరస్ బారిన పడి మరో 389మంది బాధితులు చనిపోయారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,49,306కు పెరిగిందని, ఇప్పటివరకు కరోనాతో దేశవ్యాప్తంగా 4,34,756 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారు తెలిపారు. గడిచిన 24గంటల్లో 44,157 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3,16,80,626 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,33,924 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్లో భాగంగా 58,25,49,595 మందికి కరోనా టీకాలు వేసినట్టు అధికారుల తెలిపారు.
25072 New Corona Cases Reported in India
- Advertisement -