- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు భారీగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 25,166 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 437 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,50,679కు పెరిగింది. ఇప్పటివరకు వైరస్ బారినపడి దేశంలో మొత్తం 4,32,079 మంది బాధితులు మరణించారు. 24 గంటల్లో 36,830 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,14,48,754 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో రికవరీ 97.51 శాతానికి పెరిగిందని.. ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 1.98శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 1.61శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
25166 New Corona Cases Reported in India
- Advertisement -