Friday, April 19, 2024

భార‌త్‌లో కొత్త‌గా 25వేల క‌రోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

25467 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: భార‌త్‌లో గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 25,467 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య‌శాఖ తాజాగా వెల్ల‌డించింది. మహమ్మారి కరోనా వైర‌స్ వ‌ల్ల మరో 354 మంది బాధితులు మరణించినట్లు తెలిపింది. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,24,74,773కు పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా క‌రోనా బారిన పడి 4,35,110మంది బాధితులు మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో 39,486 మంది వైర‌స్ నుంచి కోలున్నారు. ప్రస్తుతం దేశంలో 3,19,551 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 58.89 కోట్ల మందికి కోవిడ్ టీకాల‌ను వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

25467 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News