Friday, March 29, 2024

రాష్ట్రంలో కొత్తగా 255 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

255 new covid-19 cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 255 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,63,281కు పెరిగింది. తాజాగా 329 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,54,230 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒక్కరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,903కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.63 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,148 యాక్టివ్ కేసులున్నాయి. శనివారం 52,244 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News