Thursday, April 25, 2024

దేశంలో తగ్గిన పాజిటీవ్ కేసులు, మరణాలు..

- Advertisement -
- Advertisement -

26115 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి క‌రోనా వైర‌స్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 26,115 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా వెల్ల‌డించింది. కరోనాతో మరో 252మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటీవ్ కేసలు సంఖ్య 3,35,04,534కు చేరింది. ఇక, కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకు 4,45,385మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 34,469 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు దేశంలో 3,27,49,574 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం దేశంలో 3,09,575 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 96,46,778మందికి వ్యాక్సిన్ వేశామని, ఇప్ప‌టివ‌ర‌కు 81.85 కోట్ల‌కు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేశామని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

26115 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News