Friday, April 26, 2024

భారత్ @ 3.43 లక్షలు కరోనా కేసులు… నాలుగు వేల మంది మృతి

- Advertisement -
- Advertisement -

380 New Corona Cases Registered in AP

 

ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా ధాటికి దేశ ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. భారత్ లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గత 24 గంటల్లో 3,43,144 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 4 వేల మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.   తాజాగా 3,44,776 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 2,40,46,809కు చేరుకోగా 2.62 లక్షల మంది మృత్యువాతపడ్డారు.  ఇప్పటి వరకు 2,00,79,599 బాధితులు కోలుకోగా 37,04,893 మంది చికిత్స తీసుకుంటున్నారు. టీకా డ్రైవ్ శరవేగంగా జరుగుతోంది. టీకా డ్రైవ్‌ గురువారం నాటికి 118వ రోజుకు చేరగా.. ఇప్పటి వరకు 17,92,98,584 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. గత 24 గంటల్లో 18.75లక్షల టెస్టులు చేయగా 31.13 కోట్లకు చేరుకుందని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News