Friday, March 29, 2024

శ్రీవారికి 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళం

- Advertisement -
- Advertisement -

3.604 kg gold biscuits donated to srivaru

 

తిరుమల: కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు బుధవారం తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఇఒ ఎవి.ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు.

శ్రీవారిని దర్శించుకున్న మిజోరాం గవర్నర్

మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఇఒ ఎవి.ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, కాఫీ టేబుల్ బుక్, 2022 డైరీ, క్యాలెండర్ అందజేశారు.

గోగర్భం డ్యామ్ వద్ద ఆయుధపూజ

తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద టిటిడి విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆయుధపూజ జరిగింది. టిటిడి అదనపు ఎవి.ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్, ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఇ రవిశంకర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News