Friday, April 26, 2024

కొత్త సంవత్సరం వేడుకల్లో విషాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

నెల్లూరు: కొత్త సంవత్సరం తమ జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ కోరుకుంటారు.. కానీ, జిల్లాలోని వాకాడు మండలంలో న్యూ ఇయర్ విషాదాన్ని నింపింది. తిరుపతి జీవకోనకు చెందిన కొందరు నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు మండలంలోని తూపిలిపాళెం బీచ్‌కు సరదాగా వెళ్లారు. రాత్రి సముద్రం వద్ద కేక్ కట్ చేసి ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. తర్వాత సరదాగా సముద్రంలోకి వెళ్లగా అలల ఉధృత తాకిడికి వారు గల్లంతయ్యారు. చాలాసేపు తర్వాత వారి డెడ్ బాడీలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి వచ్చి.. ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ముగ్గురి మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 3 Dead after Drown into Tupilipalem beach in Nellore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News