Friday, March 29, 2024

కాగజ్ నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

కొమ్రం భీం ఆసిఫాబాద్:జిల్లాలోని కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి పేపర్ మిల్లులో విద్యుత్ ప్లాంట్ కోసం బాయిలర్ నిర్మాణ పనులు కొనసాగుతుండగా, ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలి అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడ్డాయి. దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కార్మికులు మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయి తీవ్ర గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయిన కార్మికులను బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

3 Dead after mudslide collapse in Kagaznagar Paper mill

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News