- Advertisement -
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాకతీయ కాలువలో పడిన కారులో మూడు మృతదేహాలు కనిపించాయి. ఆదివారం రాత్రం బైక్ ప్రమాదంలో మహిళ కెనాల్ కొట్టుకుపోవడంతో కాకతీయ కెనాల్కు నీటిని అధికారులు నిలిపివేశారు. నీటి మట్టం తగ్గడంతో కాలువలో కారు బయటపడింది. కారును క్రేన్ సహాయంతో పోలీసులు వెలికితీశారు. కారులో మూడు మృతదేహాలు పెద్దపల్లి ఎంఎల్ఎ దాసరి మనోహర్ రెడ్డి చెల్లి, బావ, మేనకోడలుగా గుర్తించారు. మృతులు కరీంనగర్ బ్యాంక్ కాలనీకి చెందిన సత్యనారాయణ రెడ్డి, రాధ, వినయ శ్రీగా గుర్తించారు. 20 రోజుల క్రితం కారు కాలువలో పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మూడు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
3 Dead bodies Found in Kakatiya Canal in Karimnagar
- Advertisement -