- Advertisement -
అత్వెల్లి: మేడ్చల్ శివారులోని అత్వెల్లి వద్ద శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతివేగంతో భైక్, టాటా ఏస్ పైకి కారు దూసుకెళ్లింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
- Advertisement -