Wednesday, April 24, 2024

సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

3 dead in Road Accident at Pragnapur in Siddipet

సిద్దిపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజూమున గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ వద్ద ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. మృతి చెందినవారిని మంచిర్యాల జిల్లా తాండూర్‌ కు చెందిన కొండు అంజిబాబు, యిడిదినేని గణేశ్‌, అంగల సాయిగా పోలీసులు గుర్తించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

3 dead in Road Accident at Pragnapur in Siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News