Thursday, April 25, 2024

లిఫ్ట్ కూలి ముగ్గురు మృతి..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం విటిపిఎస్ లో విషాద ఘటన జరిగింది. వైర్‌ తెగిపోవడంతో రన్నింగ్ లో ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో లిప్ట్ లో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News