Friday, April 19, 2024

ఎల్బీనగర్‌లో దారుణం: అన్న కుటుంబంపై కత్తితో తమ్ముడి దాడి..

- Advertisement -
- Advertisement -

వరంగల్‌: జిల్లాలోని ఎల్బీనగర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అన్న చాంద్ పాషా కుటుంబంపై తమ్ముడు పఫీ కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారిని చాంద్ పాషా(50), ఖలీల్(40), సబీరా(42)లుగా గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.

3 Killed as knife attack in LB Nagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News