- Advertisement -
మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. హజీపూర్ మండలం రాపెళ్లి గ్రామంలో ఓ కుటుంబంలోని ముగ్గురు వలస కార్మికులకు కరోనా వైరస్ సోకింది. వీరు మే 5వ తేదీన ముంబై నుంచి స్వస్థలాలకు వచ్చారు. ముంబై నుంచి రావడంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా వారిని హోం క్వారంటైన్ చేశారు. రెండు రోజుల క్రితం వారిలో కరోనా లక్షణాలు బయటపడడంతో తక్షణమే బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ తరలించారు. అక్కడ కరోనా పాజిట్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వలస కూలీలకు కరోనా వైరస్ సోకడంతో జిల్లా ప్రజలు అందోళన చేందుతున్నారు.
3 Migrant Workers tested Covid 19 Positive
- Advertisement -