- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 36కి చేరింది. తాజాగా ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటీవ్ వచ్చినట్లు తెలిపింది. ముగ్గురిని విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించి టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటీవ్ వచ్చింది. లండన్ నుంచి వచ్చిన హైదరాబాద్ చెందిన 49 ఏళ్ల వ్యక్తి, సౌదీ నుంచి వచ్చిన కోకా పేట చెందిన 61 ఏళ్ల మహిళ, జర్మనీ నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు కరోనా పాజిటీవ్ వచ్చింది. ముగ్గురిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
3 New Corona Positive Cases in Telangnana
- Advertisement -