- Advertisement -
వికారాబాద్ః జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మూసినది బ్రిడ్జిపై 12మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్ వర్క్ చేస్తున్న క్రమంలో రైలు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి వికారాబాద్ వస్తున్న ఓ ట్రైన్ ఇంజన్ ఢీకొట్టడంతో ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయారు. మృతి చెందినవారు నవీన్, సమీర్, ప్రతాప్ రెడ్డి అని తెలుస్తోంది.
3 Railway Employees killed after Train Hit in Vikarabad
- Advertisement -