- Advertisement -
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు మరోసారి దాడి తెగబడ్డారు. గురువారం తెల్లవారుజామున షోపియాన్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులు కాగా.. స్థానిక మహిళ ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -