Saturday, April 20, 2024

ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

లారీని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం 
ముగ్గురు యువకులు దుర్మరణం, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘటన

మన తెలంగాణ/జగిత్యాల: మన తెలంగాణ/జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సా యంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై ముగ్గురు వ్యక్తులు వెళ్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన అరుముల్ల శ్రీకాంత్ (27), అరుముల్ల పవన్ (22), అ యిలవేని నవీన్ (23) యువకులు ముగ్గు రు ఎపి 15 బిసి 9857 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు బయలుదేరారు. గాంధీనగర్ సమీపంలోకి వచ్చిన వారి వాహనం ముందుగా వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టారు. ద్విచక్రవాహనం అతివేగంతో ఉండటం వల్ల అదుపుకాక లారీకి బలంగా ఢీకొట్టడంతో ఆ ముగ్గురు యువకులు తీవ్ర గాయాల పాలై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. చేపల వేట కోసం కావాల్సిన వలలు కొనుగోలు చేసేందుకు జగిత్యాలకు వస్తూ ప్రమాదం బారిన పడినట్లు తెలుస్తోంది. జగిత్యాల టౌన్ ఎస్‌ఐ నారాయణబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఎదిగిన కొడుకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జిల్లా ప్రధాన ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో మేడిపల్లి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది.

3 spot dead in Road Accident in Jagtial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News