Friday, March 29, 2024

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రత బలాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. సోమవారం జమ్మూకశ్మీర్‌లో అనంతనాగ్ జిల్లాలో భదత్ర బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. సౌత్ కాశ్మీర్‌లోని ఖుల్ చోహర్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డెన్ సెర్చర్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ముగ్గురు తీవ్రవాదులు చనిపోయినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇంకా ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

3 Terrorists killed by security forces encounter in Anantnag

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News