- Advertisement -
మెదక్: మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన విషాదకరమైన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పొడ్చన్ పల్లిలో చోటుచేసుకుంది. సాయివర్ధన్ అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. పొడ్చన్ పల్లిలో పంట పొలాల్లో సాగుకోసం కొత్తగా బోరు వేశారు. బోరు వేసిన అరగంటలోనే చిన్నారి అందులో పడ్డాడు. బోరు వేశాక ఎవరి పనుల్లో వారుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలుడి తల్లిదండ్రులు బోరుబావి వద్ద పనిచేస్తుండగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం బోరుబావి దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆర్డీవో సాయిరాం తెలిపారు. బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
3 Year Old Boy Fell into Borewell in medak district
- Advertisement -