- Advertisement -
హైదరాబాద్: ప్రభుత్వ వైద్యం ప్రజలకు మరింత చేరువ చేయాలన్నదే సిఎం కెసిఆర్ లక్షమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలో పర్యటన సందర్భంగా హరీష్ మాట్లాడారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నామని, డయాగ్నోస్టిక్ సెంటర్ను ఇదివరకే ఏర్పాటు చేశామన్నారు. రూ.2 కోట్ల 40 లక్షలతో సిటి స్కాన్, 30 పడకల ఐసియును ప్రారంభించామని, త్వరలో మరో మూడు డయాలసిస్ పడకలను ఏర్పాటు చేస్తామని వివరించారు. జర్నలిస్టులకు సిద్ధిపేట ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేస్తున్నామన్నారు.
- Advertisement -