Thursday, April 25, 2024

అదుపుతప్పి కాలువలోకి పడిపోయిన బస్సు.. పూర్తిగా ధ్వంసం

- Advertisement -
- Advertisement -

కుతుబ్‌పూర్: బంగ్లాదేశ్‌లో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 7.30 గంటల సమయంలో మదరిపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఎమాద్ పారిబహాన్ నడుపుతున్న ఢాకా బస్సు అదుపు తప్పి పడిపోయింది. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు మదరిపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఎండీ మసూద్ ఆలం తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం, బస్సులో మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. వేగానికి బస్సు టైర్ పగిలిపోయిందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల కాలువలో పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఎమాద్ పరిబహన్ బస్సు 43 మందికి పైగా ప్రయాణికులతో ఢాకాకు బయలుదేరిందని షోనదంగా బస్ కౌంటర్ కౌంటర్ మ్యాన్ ఎండీ సాబుజ్ ఖాన్ ది మీడియాతో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News