Friday, April 26, 2024

లారీ బీభత్సం…. 30 గొర్రెలు మృతి

- Advertisement -
- Advertisement -

30 Sheeps dead in Lorry accident in Wanaparthy

వనపర్తి: లారీ అదుపుతప్పి దూసుకెళ్లడంతో 30 గొర్రెలు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. జంపన్న అనే వ్యక్తి గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు.  జాతీయ రహదారి 44పై గ్రామ శివారులో ఉన్న చెరువులోకి గొర్రెలు నీళ్లు తాగడానికి తీసుకెళ్తుండగా లారీ గొర్రెల పైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 30 గొర్రెలు మృత్యువాతపడగా మరో 20 గొర్రెలు గాయపడ్డాయి. గ్రామస్థుల సమాచారం మేరకు ఎస్ఐ నాగ శేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంపన్నకు రూ. 2.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు స్థానిక గొర్రెల కాపర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News