Saturday, April 20, 2024

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఉక్రెయిన్‌లో ఎంబిబిఎస్ చదివేందుకు వెళ్లిన 1500 మంది భారతీయులలో 300 మంది తెలుగు విద్యార్ధులూ చిక్కుకున్నారు. ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారతీయ విద్యార్థులు ఇటు స్వదేశానికి చేరుకోలేక, అటు కరోనా తాకిడికి తట్టుకోలేక సతమతమౌతున్నారు. ఉక్రెయిన్‌లో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ లక్షణాలతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్లో కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్ధులకు లాక్‌డౌన్ కారణంగా సరైన ఆహారం లభించక అంతా అవస్థలు ఎదుర్కొంటున్నారు. తమను భారత్‌కు తీసుకెళ్లాలని ఇండియన్ ఎంబసిని కోరుతున్నారు. భారత ఎంబసి అధికారులు తమను పట్టించుకోకపోతే కరోనా మహమ్మారికి బలవుతామని సదరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

300 Telugu Students stuck in Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News