Thursday, April 25, 2024

కేరళలో అదానీ పోర్ట్ కు నిరసనగా ఆందోళన…3000 మందిపై ఎఫ్ఐఆర్

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: అదానీ గ్రూప్ 900 మిలియన్ డాలర్ల ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్‌ను పునఃప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారుల సంఘం నిరసన నేపథ్యంలో… విళింజం ఓడరేవు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో, సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురిలో నలుగురిని విడుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆదివారం పోలీసుల చర్యకు నిరసనగా, లాటిన్ క్యాథలిక్ చర్చి నేతృత్వంలోని స్థానిక మత్స్యకార సంఘం విజింజం పోలీసు స్టేషన్‌పై దాడి చేసి 35 మంది పోలీసు అధికారులను గాయపరిచింది. ఆ ప్రాంతంలో చెలరేగిన హింసాకాండలో 85 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.

తిరువనంతపురంలోని లాటిన్ ఆర్చ్‌డియోసెస్ ఆర్చ్ బిషప్ థామస్ జె. నెట్టోపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, ఆయనను మొదటి నిందితుడిగా పేర్కొనడం ఉద్రిక్తతను మరింత పెంచింది. కొత్త ఎఫ్‌ఐఆర్‌లో సహాయక బిషప్ క్రీస్తుదాస్, వికార్ జనరల్ యూజీన్ పెరేరియాతో సహా యాభై మంది ప్రీస్టులు కూడా ఉన్నారు. దీంతో పాటు 3 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఆరోపణలను తోసిపుచ్చిన రాష్ట్ర ఓడరేవుల మంత్రి అహ్మద్ దేవరకోవిల్ మాట్లాడుతూ, నిరసనకారులు న్యాయవ్యవస్థను అగౌరవం పరుస్తున్నారని, నిరసనకారులు ప్రశాంతంగా ఉండాలని, కొనసాగుతున్న పనులకు అంతరాయం కలిగించవద్దని కోరారు.

Kerala protest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News