- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 3,018 కొత్త కోవిడ్ -19 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు లక్షా 1,11,688కి చేరాయి. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 780 మంది చనిపోయారు. ఈ మహమ్మారి నుంచి 85,223 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25,685 యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 1,060 మంది కరోనా బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కొత్తగా హైదరాబాద్ లో 475, రంగారెడ్డిలో 247, మేడ్చల్ లో 204, నల్గొండలో 190, ఖమ్మంలో 161, వరంగల్ అర్బన్ లో 139, నిజామాబాద్ లో కరీంనగర్ లో 127, మంచిర్యాలలో 103, జగిత్యాలలో 100, భద్రాద్రి కొత్తగూడెంలో 95 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
3018 New Covid 19 Positive Cases in Telangana
- Advertisement -