Friday, April 19, 2024

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

30570 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,570 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 431మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.33కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 4,43,928 మంది బాధితులు మృతిచెందారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,303 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 3,25,60,474 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3.42లక్షల కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 76.57కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.

30570 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News