Friday, April 19, 2024

రాష్ట్రంలో మరో 3,187 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

3187 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు అనుహ్యంగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 3,187 మందికి కరోనా వైరస్ సోకగా, ఏడుమరణాలు సంభవించాయి. అదే సమయంలో మరో 787 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.27 లక్షలకు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోంఐసోలేషన్ లో 13,366 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,759 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. 3.05 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 551 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో నిన్న 1,15,311 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

3187 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News