Thursday, April 25, 2024

2.90 లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

331 New Covid-19 Cases Reported in Telangana

కొత్తగా మరో 331 మందికి వైరస్, ముగ్గురు మృతి
జిహెచ్‌ఎంసి పరిధిలో 61, జిల్లాల్లో 270 మందికి పాజిటివ్
2,90,640కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 90 వేల 640కి పెరిగింది. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా మంగళవారం 38,192 మందికి టెస్టులు చేస్తే 331 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 61 మంది ఉండగా,ఆదిలాబాద్‌లో 6, భద్రాద్రి 12,జగిత్యాల 9, జనగాం 8, భూపాలపల్లి 4, గద్వాల 0, కామారెడ్డి 4, కరీంనగర్ 25 ,ఖమ్మం 10, ఆసిఫాబాద్ 3, మహబూబ్‌నగర్ 4,మహబూబాబాద్ 2, మంచిర్యాల 12, మెదక్ 8, మేడ్చల్ మల్కాజ్‌గిరి 28, ములుగు 4, నాగర్‌కర్నూల్ 2, నల్గొండ 11, నారాయణపేట్ 1, నిర్మల్ 1, నిజామాబాద్ 9, పెద్దపల్లి 10, సిరిసిల్లా 9, రంగారెడ్డి 21, సంగారెడ్డి 11, సిద్ధిపేట్ 9, సూర్యాపేట్ 8, వికారాబాద్ 7, వనపర్తి 3, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ లో 17, యాదాద్రిలో మరో 6 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,90,640కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,84,611కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

331 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News