Wednesday, April 24, 2024

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్

- Advertisement -
- Advertisement -

CORONA

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 3,390 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 56,342 కు పెరిగింది. ప్రస్తుతం 37,916 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 16,539 కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 1,886 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. హహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 17,974కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 694మంది చనిపోయారు. గుజరాత్ లో 7,012 కేసులుండగా.. 425మంది మృత్యువాత పడ్డారు. దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు 5,980కు చేరుకోగా… 66మంది మృతి చెందారు.

3390 new Covid positive cases 103 deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News