- Advertisement -
టెహ్రాన్:ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమాని అంతిమ యాత్రలో తొక్కిసలాట జరిగి 35 మంది మరణించగా మరో 48 మంది గాయపడ్డారు. అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన జనరల్ ఖాసీం సులేమాని అంత్యక్రియలు ఆయన స్వస్థలం కెర్మన్ పట్టణంలో మంగళవారం జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. జనరల్ సులేమాని అంతిమయాత్రలో లక్షలాది మంది పాల్గొన్నట్లు ఇరాన అధికారిక టివి ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో సోమవారం జనరల్ సులేమాని అంతిమయాత్రకు 10 లక్షల మందికి పైగా ప్రజలు హాజరైనట్లు వార్తలు వచ్చాయి.
35 died in stampede during Gen Soleimanis funeral
- Advertisement -