Friday, April 26, 2024

35కు చేరిన అలీగఢ్ క‌ల్తీమ‌ద్యం మరణాలు

- Advertisement -
- Advertisement -

22 people died after consuming spurious liquor in Aligarh

అలీగ‌ఢ్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అలీగ‌ఢ్ జిల్లా కర్సువాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మరణాల సంఖ్య 35 చేరింది. అస్వస్థతకు గురైన 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఒకే యజమానికి చెందిన 2 దుకాణాల్లో బాధితులు మద్యం తాగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు మద్యం దుకాణాలు సీజ్ చేసి యజమానిని అరెస్ట్ చేశారు. గుత్తేదారు సహా మరో 12మందికిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు అబ్కారీ అధికారులను అలీగఢ్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 5గురు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రభుత్వ లైసెన్స్ పొందిన దుకాణం నుండి మద్యం సరఫరా చేసి విక్రయించిన ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని, ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్పాప్తునకు ఆదేశించినట్టు కలెక్టర్ వెల్లడించారు.

35 people died after consuming spurious liquor in Aligarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News