Thursday, April 25, 2024

ఎపిలో మరో 36 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 9,256 శాంపిళ్లను పరీక్షించగా మరో 36 పాజిటివ్ కేసులు, ఒక మరణం నమోదయ్యాయని ఎపి వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని చిత్తూరు-9, గుంటూరు-5, కడప-2, కృష్ణా-2, నెల్లూరు-15, శ్రీకాకుళం-2 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.  దీంతో ఎపిలో మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసులు సంఖ్య 2,100కి చేరాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 48 మంది మృతి చెందగా.. 1192 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 860 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఎపిలో నమోదైన కేసుల్లో 32 కరోనా పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలకి చెందినవేనని ప్రభుత్వం వివరించింది.

AP-Corona

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News