Friday, April 19, 2024

దేశంలో కొత్తగా 36వేల కేసులు.. పెరిగిన మరణాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,73,757మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 36,401 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. కరోనాతో మరో 530మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇప్పటివరకు వైరస్‌ బారినపడి 4,33,049మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 39,157మంది బాధితులు కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు 3,15,25,800మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,64,129 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 97.53 శాతానికి పెరిగగా.. రోజువారి పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు దేవంలో 56.64కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది.

36401 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News