Friday, April 19, 2024

మంగళూరులో 38 మంది శ్రీలంక‌న్ల అరెస్ట్‌

- Advertisement -
- Advertisement -

38 Sri Lankans arrested in Mangalore

బెంగ‌ళూరు: క‌ర్నాటక‌ రాష్ట్రం మంగళూరులోని దక్షిణ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్ర‌మంగా నివసిస్తున్న ముప్పై ఎనిమిది మంది శ్రీలంకన్ల‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగ‌ళూరు న‌గ‌రంలోకి వీరు అక్ర‌మంగా ప్ర‌వేశించార‌ని పోలీసులు వెల్లడించారు. శ్రీలంకకు చెందిన 38 మంది ఈ ఏడాది మార్చి మధ్యలో తొలుత‌ తమిళనాడుకు చేరుకున్నారని, తరువాత బెంగళూరుకు, అక్క‌డి నుంచి మంగళూరుకు చేరుకున్నారని పోలీస్ కమిషనర్ ఎన్ శశి కుమార్ తెలిపారు. వారికి ఆశ్ర‌యం క‌ల్పించి సహాయం చేస్తున్న కొందరు స్థానికుల‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఐపిసి మానవ అక్రమ రవాణా, మోసం, పాస్‌పోర్ట్ చట్టం 1967, విదేశీయుల చట్టం 1945, విదేశీయుల ఉత్తర్వు 1948 కింద మేము కేసు నమోదు చేసామని పోలీసులు చెప్పారు.

38 Sri Lankans arrested in Mangalore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News