Thursday, March 28, 2024

ఘోర ప్రమాదం: నలుగురు సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కును లారీ డీకొట్టింది. దీంతో భారీగా పేలుళ్లు సంభవించి మంటలు చెలరేగడంతో నలుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన అజ్మీర్‌ జిల్లాలోని ఆదర్శ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలో హైవే రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దాదాపు 45 నిమిషాలపాటు పేలుళ్లు సంభవించడంతో అజ్మీర్-జైపూర్ ఎక్స్ ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

4 burnt to death in road accident in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News