- Advertisement -
గుంటూరుః జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై బుధవారం అర్థరాత్రి ఓ కంటైనర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
4 dead in Road Accident in Guntoor
- Advertisement -