Thursday, March 28, 2024

ఉమ్మడి అదిలాబాద్ లో పిడుగు పడి నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

4 Died due to Lightning strike in Adilabad

అదిలాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ఉమ్మడి జిల్లాలో పిడుగు పడి నలుగురు మృతిచెందారు. జిల్లాలో బజార్త్ నూర్ మండలం తుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరూ దంపతులు మృతి చెందగా, బుర్కపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు  మృతి చెందారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలంలోని రుద్ర సముద్రం గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ కురిసింది. ఇదే సమయంలో గ్రామ శివారులో ఉన్న గొర్రెల మందపై పిడుగు పడింది. పిడుగుపాటుకు 70 కిపైగా గొర్రెలు మృతి చెందాయి. దీంతో గోర్రెల యజమాని తీవ్ర ఆవేధన వ్యక్తం చేశాడు.

4 Died due to Lightning strike in Adilabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News