- Advertisement -
నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు సాగర్ జలాశయం 4 క్రస్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 84,910 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోండగా, అదేస్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 589.80 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 311.74 టీఎంసీలుగా ఉంది.
4 Gates Opened at Nagarjuna Sagar Project
- Advertisement -