Saturday, April 20, 2024

డివైడర్ ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు: నలుగురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

4 Injured after RTC Bus hits Divider in Gadwal

జోగులాంబ గద్వాల: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూల్ నుండి హైదరాబాద్ వైపు అర్ధరాత్రి 12 తర్వాత బయలుదేరిన ఆర్టిసి బస్సు ఉండవెల్లి శివారులో జాతీ యరహదారిపై సెంటర్ డివైడర్ పైకి ఎక్కడంతో అదుపు తప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు కాగా, అందులో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. రాముడు(55), రవికుమార్(42), నరసింహులు(21), బస్సు డ్రైవర్ లు తీవ్రంగా గాయపడ్డవారిలో ఉన్నారు. ప్రమాదానికి ముందు బస్సులో 32 మంది ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదే సమయంలో ముందు బస్సును అంచనా వేయలేక వెనుక వస్తున్న కారు ఢీకొన్నట్లు తెలిసింది. కార్లో ప్రయాణిస్తున్న వాళ్ళకి స్వల్పంగా గాయలయ్యాయి. క్షతగాత్రులు అందర్నీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

4 Injured after RTC Bus hits Divider in Gadwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News