- Advertisement -
కరీంనగర్: జిల్లాలోని మానకొండూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
4 Killed in Road Accident in Manakondur
- Advertisement -