Thursday, March 28, 2024

కంటైనర్ ఢీకొని బాలుడు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

4 year old boy killed in Road accident at Patancheru

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్ చౌరస్తాలో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్ లో వచ్చిన కంటైనర్, ట్యాంకర్ ను తప్పించబోయి గుడిసెలోకి దూసుకెళ్లింది. కంటైనర్ ఢీకొనటంతో నాలుగేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కంగ్టి మండలం తడ్కల్ కు చెందిన శాంతికుమార్ గా గుర్తించారు. గుడ్ ప్రైడే సందర్భంగా తల్లితో కలిసి చర్చికి వెళ్లొస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కళ్లముందే రక్తపు ముద్దగా మారిన బిడ్డను చూసి తల్లి గుండెలు బాదుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

4 year old boy killed in Road accident at Patancheru

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News