Thursday, April 25, 2024

ఎపిలో కొత్తగా 415 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

415 New Corona Cases Reported in AP

అమరావతి: ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 415 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో ఆరుగురు మరణించినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20.64లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 14,356 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 584 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో 20.45లక్షలకు పైగా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,655 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. స్వీయనియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలకు సూచించారు.

415 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News