Saturday, April 20, 2024

దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..

- Advertisement -
- Advertisement -

30941 new corona cases were registered in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,766 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 308మంది బాధితులు మృతిచెందారు. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 3,29,88,673కు పెరిగింది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 4,40,533మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 38,091 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,10,048 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, దేశంలో కరోనా రికవరీ రేటు 97.42 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 66.89 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు పేర్కొంది.

42766 New Corona Cases Report in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News